విష్ణు అవతారాలు మనం అనుకునే విధంగా కేవలం భక్తి కథలు కాదు. మత్స్య అవతారం నుంచి కల్కి అవతారం వరకు భూమిపై జీవం ఎలా ఉద్భవించి ఎలా అభివృద్ధి చెందింది అనేది శాస్త్రీయంగా తెలుపుతుంది. మత్స్య అవతారం మొదటి అవతారం, భూమిపై జలచరాలు మొదట ఉద్భవించాయని, తర్వాత కూర్మావతారం, జలచరాలు ఉభయచరాలుగా రూపాంతరం చెందటాన్ని, వరాహ అవతారం పూర్తిస్థాయి భూచర రూపాంతరం, నారసింహ అవతారం జంతువు నుంచి మనిషిగా రూపాంతరం చెందటంలో ప్రాథమిక దశను, వామనావతారం పూర్తి స్థాయి మానవ రూపాన్ని, తర్వాత వచ్చే 5 అవతారాలు మానవ సామాజిక పరిణామ క్రమాన్ని సూచిస్తాయి. మన ప్రాచీనులు, ఋషులు, మునులు చెప్పిన ప్రతి అంశం మనిషికి ఎదో ఒక ఉపయోగకరమైన విషయాన్ని బోధించేవే కాని, పుక్కిటి పురాణాలు కాదు. ఇప్పుడు మనం చూస్తున్న ఆధునిక విజ్ఞానం అంతా ఒకప్పుడు మనవాళ్లు ఇంతకంటే మంచిగా ఉపటోగించుకున్నారు. తర్వాతి కాలంలో జరిగిన సాస్కృతిక దాడుల్లో చాలా వరకు మన పూర్వికులు అందించిన విజ్ఞానం నాశనం అయ్యింది. చదువు రాని వాడికి కంప్యూటర్ ఉపయోగం తెలియనంత మాత్రాన అది ఉపయోగకరమైన వస్తువు కాకుండా పోదు కదా, మన వేదాలు, పురాణాలు అర్థం కానంత మాత్రాన అవి వ్యర్థం అయిపోవు కదా
SanthoshKumar Sharma Gollapelli
SanthoshKumar Sharma Gollapelli
0 comments :
Post a Comment