ఆలయం బయట సత్సంగం నడుస్తోంది. స్వామీజీ దేవుడి గురించి ప్రసంగిస్తున్నాడు. అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. స్వామీజీ నాదో సందేహం అన్నాడు ఆ యువకుడు. చెప్పునాయనా అన్నాడు స్వామీజీ ప్రసంగాన్ని అపేసి, దేవుడు, దేవుడు అని తెగ చెప్పేస్తున్నారు కదా నాకు దేవున్ని చూపించండి మీకు శక్తి ఉంటే అని వ్యంగ్యంగా అన్నాడు. దానికి స్వామీజి అదేం పెద్ద విషయం కాదు నాయనా నాకో చిన్న పని చేసిపెట్టు నీకు దేవున్ని చూపిస్తా అన్నాడు. ఆ యువకుడు చెప్పండి చిటికెలో చేసేస్తా అన్నాడు. దానికి స్వామీజీ నీ నుదిటిపై ఎన్ని గీతలున్నాయో చెప్పు అంటాడు. దానికి ఆ యువకుడు పక్కన ఉన్న స్నేహితుడిని అద్దం తెమ్మని పంపిస్తాడు. దానికి స్వామీజీ అద్దం ఎందుకు నాయనా అంటాడు. దానికి ఆ యువకుడు పిచ్చోళ్లా మీరు అద్దంలో చూడకుండా ముఖం ఎలా కనిపిస్తుంది అంటాడు. దానికి స్వామీజీ నీ ముఖం చూసుకోవటానికి నీకు అద్దం అనే సాధనం ఎలా కావాలో దేవున్ని చూడటానికి నిర్మల భక్తి అనే సాధనం అవసరం. నువు ఆ సాధనాన్ని సాధించినప్పుడు దేవుడు తనంతటటానుగా నీకు కనిపిస్తాడు. అని సమాధానం చెప్తాడు స్వామీజీ. తప్పు తెలుసుకున్న యువకుడు పశ్చాత్తాపంతో అక్కడినుంచి వెళ్లిపోతాడు.
SanthoshKumar Sharma Gollapelli
SanthoshKumar Sharma Gollapelli
0 comments :
Post a Comment