"నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది" అంటారు.. ఇలాంటి సామెతలు వినీ వినీ వాటిలో ఎంత మీనింగ్ ఉన్నా మనకు కొత్తగా ఏమీ ఒంటబట్టట్లా..
ఏ రంగంలో అయినా విశ్లేషణలు చేయొచ్చు.. దానికి కొద్దో గొప్పో మేధస్సూ, ఆ రంగం పట్ల అవగాహనా ఉంటే సరిపోతుంది. కానీ ఏ విశ్లేషణ అయినా పరిస్థితిని చక్కదిద్దేదై ఉండాలి, సున్నితంగా ఉండాలి, ఎవర్నీ గాయపరచనిదై ఉండాలి.. అన్నింటికీ మించి తనకి "మేధావితనం" ఆపాదించబడాలన్న కాంక్ష కొద్దీ ఏ విశ్లేషకుడూ విశ్లేషణలు చెయ్యకూడదు. అతని పర్పస్ అది కాదు, అతని మేధస్సు కన్నా ఆ రంగపు శ్రేయస్సు ముఖ్యం, ఆ శ్రేయస్సు సాధ్యపడాలంటే నలుగుర్నీ కలుపుకుపోయే తత్వం కలిగి ఉండాలి.
ఏ రంగంలో అయినా విశ్లేషణలు చేయొచ్చు.. దానికి కొద్దో గొప్పో మేధస్సూ, ఆ రంగం పట్ల అవగాహనా ఉంటే సరిపోతుంది. కానీ ఏ విశ్లేషణ అయినా పరిస్థితిని చక్కదిద్దేదై ఉండాలి, సున్నితంగా ఉండాలి, ఎవర్నీ గాయపరచనిదై ఉండాలి.. అన్నింటికీ మించి తనకి "మేధావితనం" ఆపాదించబడాలన్న కాంక్ష కొద్దీ ఏ విశ్లేషకుడూ విశ్లేషణలు చెయ్యకూడదు. అతని పర్పస్ అది కాదు, అతని మేధస్సు కన్నా ఆ రంగపు శ్రేయస్సు ముఖ్యం, ఆ శ్రేయస్సు సాధ్యపడాలంటే నలుగుర్నీ కలుపుకుపోయే తత్వం కలిగి ఉండాలి.
కానీ ఇటీవలి కాలంలో విశ్లేషణలు హద్దులు దాటుతున్నాయి. జస్ట్ ఇంటలెక్చువల్
అన్న ముద్ర పొందడానికి అడ్డగోలుగా, బుర్రనంతా జ్యూస్ వేసేసి లాజిక్ పిండేసి
మాట్లాడేవారు ఎక్కువైపోయారు. అలా మాట్లాడే వ్యక్తులకు మొదట్లో గౌరవం
లభిస్తుందేమో గానీ మెల్లమెల్లగా మనుషులు దూరం అవడం మొదలెడతారు.
మనిషి ముఖ్యం.. లాజిక్ కాదు. అందరికీ భిన్నంగా ఆలోచించడం అవసరమే.. విశ్లేషణ చెయ్యడం అవసరమే కానీ.. అది అందర్నీ నెట్టేసి నేనే మేధావిని అని విర్రవీగేలా ఉండకూడదు. అన్నీ తెలిసి ఉండీ, మేధస్సు ఉండీ.. కనీసపు ఈ బేసిక్ విషయాల్ని విస్మరించి మనుషులకు దూరమయ్యే వాళ్లని చాలామందిని నేను చూశాను. మీరు ఏ రంగంలో అయినా ఉండండి.. అవసరమైతే తల వంచుకోండి.. అవతల అర్హత ఉన్న వ్యక్తి ఉంటే పాదాలపై పడడానికైనా ఇగో లేకుండా బ్రతకండి.. కానీ స్టిఫ్ గా ఉండడమే గొప్పన్నట్లూ, "నేను ఇంత లాజికల్గా argue చెయ్యగలుగుతున్నాను కాబట్టి నేనే కరెక్ట్ అనే నైజం తలకి ఎక్కకుండా చూసుకోండి.. అది మనల్ని అధఃపాతాళానికి తోసేస్తుంది.
అలాగే మీ రంగంలో అందరి లోపాల గురించి భూతద్ధంలో చూపించి మీ ఉనికిని సంపాదించుకోకండి. ఎదుటి వ్యక్తుల లోపాల మీద ఏర్పడిన మీ ఉనికి నీటి బుడగ లాంటిది. అది పేలిపోతుంది.
మనిషిగా బ్రతకండి చాలు.. మేధావిగా అవసరం లేదు, మీరు గొప్ప మేధావిననుకుంటే అంతకన్నా గొప్ప మేధావులు వారాల తరబడి అన్ని పనులూ మానేసి మీతో argue చెయ్యడానికి ప్రపంచంలో ప్రతీ మూలనా ఉంటారు.
Source : Sridhar Nallamothu
- నల్లమోతు శ్రీధర్
మనిషి ముఖ్యం.. లాజిక్ కాదు. అందరికీ భిన్నంగా ఆలోచించడం అవసరమే.. విశ్లేషణ చెయ్యడం అవసరమే కానీ.. అది అందర్నీ నెట్టేసి నేనే మేధావిని అని విర్రవీగేలా ఉండకూడదు. అన్నీ తెలిసి ఉండీ, మేధస్సు ఉండీ.. కనీసపు ఈ బేసిక్ విషయాల్ని విస్మరించి మనుషులకు దూరమయ్యే వాళ్లని చాలామందిని నేను చూశాను. మీరు ఏ రంగంలో అయినా ఉండండి.. అవసరమైతే తల వంచుకోండి.. అవతల అర్హత ఉన్న వ్యక్తి ఉంటే పాదాలపై పడడానికైనా ఇగో లేకుండా బ్రతకండి.. కానీ స్టిఫ్ గా ఉండడమే గొప్పన్నట్లూ, "నేను ఇంత లాజికల్గా argue చెయ్యగలుగుతున్నాను కాబట్టి నేనే కరెక్ట్ అనే నైజం తలకి ఎక్కకుండా చూసుకోండి.. అది మనల్ని అధఃపాతాళానికి తోసేస్తుంది.
అలాగే మీ రంగంలో అందరి లోపాల గురించి భూతద్ధంలో చూపించి మీ ఉనికిని సంపాదించుకోకండి. ఎదుటి వ్యక్తుల లోపాల మీద ఏర్పడిన మీ ఉనికి నీటి బుడగ లాంటిది. అది పేలిపోతుంది.
మనిషిగా బ్రతకండి చాలు.. మేధావిగా అవసరం లేదు, మీరు గొప్ప మేధావిననుకుంటే అంతకన్నా గొప్ప మేధావులు వారాల తరబడి అన్ని పనులూ మానేసి మీతో argue చెయ్యడానికి ప్రపంచంలో ప్రతీ మూలనా ఉంటారు.
Source : Sridhar Nallamothu
- నల్లమోతు శ్రీధర్
0 comments :
Post a Comment